తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం బెట్టింగ్ యాప్స్ గురించి పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. టీజీఎస్ ఆర్టీసీ ఎండీ సజ్జనార్.. వరుస ట్వీట్లతో అటు సామాన్యులకు ఈ యాప్స్ చేసే మోసాలపై అవగాహన కల్పించటమే కాకుండా.. వాటిని ప్రమోట్ చేస్తున్న యూట్యూబర్లు, ఇన్ఫ్లూయెన్సర్లపై ట్వీట్ల తూటాలు పేల్చుతున్నారు. ఆయన పెట్టే ట్వీట్లతో పోలీసులు వారిపై కేసులు కూడా నమోదు చేస్తున్నారు. ఈ క్రమంలోనే యూట్యూబర్ హర్షసాయిపై కేసు నమోదు చేయగా.. ఇన్స్టాగ్రామ్లో ఇంట్రెస్టింగ్ పోస్టే కాకుండా వీడియో కూడా పెట్టాడు.