నేపాల్లో హింసాత్మక పరిస్థితుల కారణంగా మానస సరోవర యాత్రకు వెళ్లిన తెలుగు యాత్రికులు చైనా సరిహద్దుల్లో చిక్కుకున్నారు. వారిని స్వదేశానికి రప్పించాలని బాధితులు వేడుకుంటున్నారు. మరోవైపు, ఏపీ ప్రభుత్వం నేపాల్లో చిక్కుకున్న వారిని వెనక్కి తీసుకురావడానికి చర్యలు చేపట్టింది. ఇందుకు ప్రత్యేక విమానం ఏరర్పాటు చేసింది. ఈ విమానం ద్వారా 144 మంది యాత్రికులను కాఠ్మాండూ నుండి విశాఖపట్నం, తిరుపతికి తరలిస్తున్నారు. మంత్రి నారా లోకేష్ సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు.