నేపాల్ నుంచి సేఫ్‌గా వచ్చేసిన 144 మంది ఏపీవాసులు

6 months ago 9
నేపాల్‌లో చిక్కుకున్న ఆంధ్ర రాష్ట్ర టూరిస్టులను సురక్షితంగా తీసుకొచ్చేందుకు ప్రభుత్వం చేసిన కృషి ఫలించింది. మంత్రి నారా లోకేశ్‌ చొరవతో ఎట్టకేలకు వారు ప్రత్యేక విమానంలో వైజాగ్, రేణిగుంటలకు చేరుకుని అక్కడి నుంచి వారి వారి స్వస్థలాలకు వెళ్లారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి విహారయాత్ర, తీర్థయాత్ర, ఉపాధి, ఉద్యోగం, వ్యాపారం, ఇతర పనులపై నేపాల్‌ వెళ్లిన వారు... అక్కడ అల్లర్ల కారణంగా చిక్కుకుపోయారు. ఆ దేశంలోని 12 ప్రాంతాల్లో 217 మంది ఏపీ వాసులు ఉన్నట్లు అధికారులు ప్రాథమికంగా గుర్తించారు. రాష్ట్ర ప్రభుత్వం గురువారం ఏర్పాటు చేసిన ప్రత్యేక విమానం 144 మందితో కాఠ్‌మాండూ నుంచి విశాఖకు చేరుకుంది. వీరిలో విశాఖలో 104 మంది దిగారు. మిగతా 40 మంది అక్కడి నుంచి రేణిగుంట విమానాశ్రయం చేరుకున్నారు. మీ అందరికీ ఆత్మీయ స్వాగతం. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం, ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేశ్‌ మీ కోసం ప్రత్యేక విమానం ఏర్పాటు చేశారు. మీ అందరినీ సురక్షితంగా స్వస్థలాలకు తీసుకెళ్లే అవకాశాన్ని కల్పించారు. ఇందుకు వారికి ప్రత్యేక కృతజ్ఞతలు అని ఎయిర్‌హోస్టెస్‌ ప్రకచించే వీడియోని ప్రయాణికులు విడుదల చేశారు.
Read Entire Article