నేపాల్లో చిక్కుకున్న ఏపీవాసులను స్వస్థలాలకు తీసుకువచ్చేందుకు మంత్రి నారా లోకేష్ చేసిన కృషి ఫలిచింది. తొలివిడతగా 22 మందిని బిహార్ సరిహద్దులకు తరలిస్తున్నారు. నేపాల్లో మొత్తం 217 మంది తెలుగువారు చిక్కుకున్నట్లు అంచనా. ఈ నేపథ్యంలో వీరిని సురక్షితంగా రాష్ట్రానికి చేర్చేందుకు నారా లోకేష్ ప్రత్యేక వార్ రూమ్ ఏర్పాటు చేసి పరిస్థితిని సమీక్షిస్తున్నారు. మరోవైపు రేపు ఉదయం ఢిల్లీ నుంచి ఖాట్మాండుకు ప్రత్యేక విమానం వెళ్లనుంది. ప్రత్యేక విమానాల ద్వారా నేపాల్లో చిక్కుకున్న వారిని స్వదేశానికి తీసుకురానున్నారు.