Tdp Mla Kotla Family Stuck In Nepal: నేపాల్లో చిక్కుకుపోయిన ఆంధ్రప్రదేశ్ యాత్రికులను రాష్ట్ర ప్రభుత్వం సురక్షితంగా వెనక్కి తీసుకువచ్చింది. టీడీపీ ఎమ్మెల్యే కోట్ల జయసూర్యప్రకాష్రెడ్డి భార్య, కుమార్తెతో సహా 83 మంది యాత్రికులు ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. కాఠ్మాండూలోని హోటల్పై దాడి జరగడంతో సుమారు రూ.50 లక్షలు నష్టం వాటిల్లింది. మంత్రి లోకేష్ యాత్రికులతో మాట్లాడి ధైర్యం చెప్పారు. ప్రత్యేక విమానంలో 144 మందిని విశాఖకు తరలించారు, అక్కడనుండి వారి స్వస్థలాలకు పంపించారు.