వికారాబాద్ జిల్లా కరన్కోట్ పంచాయతీ కార్యదర్శి పోస్టు ఖాళీగా ఉండటంతో గ్రామస్తులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గతంలో పనిచేసిన కార్యదర్శి బదిలీ కావడంతో పారిశుద్ధ్యం, తాగునీటి సరఫరా వంటి పనులు సక్రమంగా జరగడం లేదు. రాజీవ్ యువ వికాసం స్కీమ్ లబ్ధిదారుల ఎంపికకు సంబంధించి పనులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. వెంటనే రెగ్యులర్ కార్యదర్శిని నియమించాలని గ్రామస్తులు కోరుతున్నారు. తాండూరు ఎంపీఓ సుశీల్కుమార్ స్పందిస్తూ ఒకటి రెండు రోజుల్లో సీనియర్ కార్యదర్శికి బాధ్యతలు అప్పగిస్తామని తెలిపారు.