హైదరాబాద్ నగరంలో వినాయక నిమజ్జన వేడుకలు మొదలయ్యాయి. ఇప్పటి నుంచే చాలా వరకు విగ్రహాలను హుస్సేన్ సాగర్ వద్ద నిమజ్జనం చేసేందుకు తీసుకెళ్తున్నారు. ఇక సెప్టెంబర్ 6, 7 తేదీల్లో అత్యధిక సంఖ్యలో ట్యాంక్బండ్ వైపు విగ్రహాల శోభాయాత్ర నిర్వహించనున్నారు. అయితే నగరంలో ఈ వేడుకలను చూసేందుకు వచ్చే ప్రయాణికుల కోసం ఆర్టీసీ ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది. దాదాపు 12కిపైగా డిపోల నుంచి ఈ బస్సులు నడపనున్నారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.