పండుగ రోజు గాడిదలు కాస్తున్నారా.? రోజా ఘాటు వ్యాఖ్యలు

3 months ago 22
మాజీ మంత్రి ఆర్కే రోజా కూటమి ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ఉగాది పండుగను వైఎస్ జగన్, భారతి దంపతులు కుటుంబ సమేతంగా సంతోషంగా జరుపుకున్నారని.. కానీ చంద్రబాబు, పవన్ కళ్యాణ్ తమ భార్యలతో కలిసి ప్రజలకు ఎందుకు శుభాకాంక్షలు చెప్పలేదని ప్రశ్నించారు. పండుగ పూట చంద్రబాబు భార్య హెరిటేజ్‌లో పాలు పిసుకుతున్నారా? అంటూ రోజా ఘాటు వ్యాఖ్యలు చేశారు. టీటీడీ ఛైర్మన్ బి.ఆర్. నాయుడుపై మండిపడిన రోజా.. తిరుమలలో ఉగాది వేడుకలు నిర్వహించకుండా ఎక్కడికి పోయారని నిలదీశారు. కూటమి ప్రభుత్వం ఆడబిడ్డ నిధి వంటి హామీలను అమలు చేయడంలో విఫలమైందని, రాష్ట్రంలో రైతులు, నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని రోజా ఆరోపించారు.
Read Entire Article