శ్రీరామనవమి పర్వదినం వేళ రేవంత్ రెడ్డి సర్కార్ తీపికబురు వినిపించింది. ఈ మేరకు సీతారామ ప్రాజెక్ట్ నిర్మాణానికి గానూ సవరించిన అంచనా బడ్జెట్కు సీఎం రేవంత్ రెడ్డి ఆమోదం తెలిపినట్లుగా వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు వెల్లడించారు. అనంతరం సీఎం రేవంత్ రెడ్డికి మంత్రి తుమ్మలతో పాటు నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు.