తెలంగాణలోని పట్టణ పేదల సొంతింటి కలను సాకారం చేసేందుకు రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. కేంద్రం 'PMAY-U 2.0' కింద 20 వేల ఇళ్లకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో పాటు రూ. 300 కోట్ల నిధులు విడుదల చేసింది. ఆ ఇళ్లను పట్టణాల్లోని పేదలకు కేటాయించనున్నారు. హైదరాబాద్ సహా ఇతర కార్పొరేషన్లలోని నిరుపేదలకు ప్రాధాన్యతనిస్తూ.. అసంపూర్తిగా ఉన్న 29 వేల డబుల్ బెడ్రూమ్ ఇళ్లను పూర్తి చేసి పంపిణీ చేసేందుకు ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది.