యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి వెళ్లే భక్తుల సౌకర్యార్థం హైదరాబాద్ నుండి యాదాద్రికి ఎంఎంటీఎస్ ఫేజ్-2 విస్తరణ ప్రాజెక్టును రైల్వే శాఖ చేపట్టింది. రూ.412 కోట్ల వ్యయంతో 2028 నాటికి ఈ ప్రాజెక్టును పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇది పూర్తయితే హైదరాబాద్ నుంచి యాదగిరిగుట్టకు తక్కువ ఖర్చుతో, గంటలోపే చేరుకోవచ్చు.