పత్తి కొనుగోళ్లలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే మొదటి స్థానంలో నిలిచింది. కేంద్ర టెక్స్టైల్స్ శాఖ ఈ విషయాన్ని తెలిపింది. తెలంగాణ నుంచి 40 లక్షల పత్తి బేళ్లను కేంద్రం సేకరించింది. మహారాష్ట్ర 30 లక్షల బేళ్లతో రెండో స్థానంలో నిలిచింది. దేశవ్యాప్తంగా 508 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయగా.. తెలంగాణలో 94 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఈ సీజన్లో రైతులకు కేంద్ర ప్రభుత్వం మొత్తంగా రూ.37,450 కోట్లకు పైగా చెల్లించినట్టు ప్రకటించింది.