తెలంగాణ పత్తి రైతులకు శుభవార్త. ఇకపై దళారులకు తక్కువ ధరకు పత్తిని అమ్మాల్సిన పనిలేదు. మంత్రులు తుమ్మల కీలక ఆదేశాలతో, దగ్గర్లోని జిన్నింగ్ మిల్లుల్లోనే నేరుగా పత్తిని విక్రయించవచ్చు. కొనుగోళ్ల ప్రక్రియను వేగవంతం చేసి, రైతులకు మద్దతు ధర అందేలా చూడాలని అధికారులకు సూచనలు జారీ చేశారు. విత్తన చట్టంపై రైతుల అభిప్రాయాలు సేకరించాలని కూడా ఆదేశించారు.