కేంద్ర ప్రభుత్వపు జాతీయ కుటుంబ ప్రయోజన యోజన గురించి ప్రజల్లో పరిచయం కొరవడింది. కుటుంబ పోషకుడు చనిపోతే.. దారిద్య్రరేఖకు దిగువన ఉన్న కుటుంబాలకు రూ.20,000 ఆర్థిక సాయం లభిస్తుంది. ఈ పథకం గురించి చాలా మందికి తెలియక దరఖాస్తులు నామమాత్రంగానే నమోదవుతున్నాయి. నారాయణపేట జిల్లాను దీనికి ప్రత్యక్ష నిదర్శనంగా చెప్పుకోవచ్చు. దీనిపై ఉన్నతాధికారులు ఆశ్చర్యం వ్యక్తపరిచారు. స్థానిక పాలనా యంత్రాంగం క్షేత్రస్థాయిలో విస్తృత అవగాహన కల్పించాలని.. ప్రచార కార్యకలాపాలు చేపట్టాలని ఆదేశాలు జారీ చేశారు.