తెలంగాణలో పదో తరగతి పరీక్షల షెడ్యూల్ ఖరారైనట్లు వార్తలు వస్తున్నాయి. 2026, మార్చి 18 నుంచి తెలంగాణలో పదవ తరగతి పరీక్షలు ప్రారంభం అయ్యే అవకాశం ఉంది. అయితే ఈ సారి పరీక్షల నిర్వహణలో అనేక మార్పులు చేయబోతున్నారు. మరీ ముఖ్యంగా సీబీఎస్ఈ తరహాలో పరీక్షల మధ్య ఒకటి రెండు రోజులు గ్యాప్ ఇవ్వాలని ప్రభుత్వం ఆలోచిస్తోంది. దీనివల్ల స్టూడెంట్స్పై ఒత్తిడి తగ్గుతుందని భావిస్తున్నారు. అందుకే పరీక్షల తేదీల ప్రకటనలో కాస్త ఆలస్యం జరుగుతుంది అంటున్నారు అధికారులు.