పద్మశ్రీ అవార్డు గ్రహీత, పర్యావరణవేత్త వనజీవి రామయ్య అనారోగ్యంతో కన్నుమూశారు. చిన్నప్పటి నుంచి చెట్ల పెంపకం కోసం కృషి చేసిన ఆయన మృతి పట్ల పలువురు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. పర్యావరణ పరిరక్షణకు ఆయన చేసిన కృషి చిరస్మరణీయం. ఆయన చేసిన కృషికి 2017లో భారత ప్రభుత్వం పద్మశ్రీ అవార్డుతో సత్కరించింది. ఆయనది ఖమ్మం జిల్లా ఖమ్మం రూరల్ మండలం రెడ్డిపల్లి గ్రామం. జీవితం అంతా మొక్కలు నాటడానికే తన జీవితాన్ని అంకితం చేసిన రామయ్య అందరికీ ఎంతో స్పూర్తిదాయకం.