Palasa Man Jumps Into Train Died: శ్రీకాకుళం జిల్లా పలాస రైల్వే స్టేషన్ మూడో నెంబరు ప్లాట్ఫారంపై గుర్తుతెలియని యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. కామాఖ్య రైలు పలాస మీదుగా భువనేశ్వర్ వైపు వెళ్తోంది.. ఇంతలో ప్లాట్ఫారంపై నుంచి గుర్తుతెలియని యువకుడు ఒక్కసారిగా రైలుకింద పడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ప్లాట్ఫారంపై రైలు వేగాన్ని నియంత్రించి వెళ్తున్న క్రమంలో ఈ ఘటన చూసిన డ్రైవరు రైలును నిలిపివేశాడు. అప్పటికే ఆ యువకుడి శరీరం నుజునుజ్జయింది. అంతకముందే పలక్నుమా కింద పడేందుకు ప్రయత్నించగా ప్రయాణికులు అతడ్ని కాపాడారు.. రెండోసారి చావు తప్పలేదు.