తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు గోదావరి జలాల వివాదంపై గట్టి హెచ్చరికలు జారీ చేశారు. బనకచర్ల లింక్ ప్రాజెక్టును అడ్డుకుంటామని.. తెలంగాణ హక్కులను హరిస్తే న్యాయస్థానాలను ఆశ్రయిస్తామని స్పష్టం చేశారు. 968 టీఎంసీల గోదావరి నీటి వినియోగానికి మొదట అనుమతించాలని డిమాండ్ చేశారు. కృష్ణా బేసిన్లో 500 టీఎంసీలకు, గోదావరిలో 1000 టీఎంసీలకు ఎన్.ఓ.సి. ఇస్తేనే బనకచర్లకు అభ్యంతరం లేదన్నారు. కేసీఆర్ గతంలో తెలంగాణకు అన్యాయం చేశారని ఆరోపించారు.