Ipur Thasildar Office Farmer Protest: పల్నాడు జిల్లా ఈపూరులో ఓ రైతు తహశీల్దారుకు ఊహించని ట్విస్ట్ ఇచ్చారు. తహసీల్దారు కార్యాలయం ముందు బైఠాయించి పొలంలో సాగు నీటి సదుపాయం ఉన్నట్లుగా బోరు ధ్రువపత్రం సాధించుకున్నాడు. కొద్దిసేపు అక్కడ హైడ్రామా జరగ్గా.. చివరికి పోరాడి అనుకున్న ధ్రువపత్రాన్ని సాధించాడు. అంతేకాదు ఆ రైతు తెలుగు దేశం పార్టీలో కీలకమైన పదవిలో యాక్టివ్గా పనిచేస్తున్నారు. ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశం అయ్యింది.