ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తన దాతృత్వంతో ఆదర్శంగా నిలుస్తున్నారు. ఇటీవల ఆయన నంద్యాల జిల్లాలోని కొణిదెల గ్రామానికి రూ.50 లక్షలు విరాళంగా ప్రకటించారు. అంతేకాకుండా, తలసేమియా బాధితులకు, వరద సహాయానికి భారీగా విరాళాలు అందజేశారు. పిఠాపురంలో ఎలక్ట్రీషియన్లకు సేఫ్టీ కిట్లు పంపిణీ చేశారు. ఇలా ఒక్క సంవత్సరంలోనే దాదాపు 20 కోట్ల రూపాయలు విరాళంగా ఇచ్చి తన గొప్ప మనసును చాటుకున్నారంటూ జనసేన శ్రేణులు ట్వీట్లు చేస్తున్నాయి.