తిరుపతి జిల్లా జనసేన ఇంఛార్జ్ కిరణ్ రాయల్ తాజాగా మీడియాతో మాట్లాడారు. తనకు లక్ష్మీ రెడ్డికి కేవలం ఆర్థిక లావాదేవీలు మాత్రమే ఉన్నాయని.. ఈ కేసులో క్లీన్ చిట్ రావడంతో మళ్లీ నేషనల్ హైవేలా దూసుకెళ్తానని తేల్చి చెప్పారు. తిరుపతిలో కాపులను రాజకీయంగా తొక్కాలని చూస్తున్నారని.. తాను ఏ తప్పు చేయలేదని తమ అధినేత పవన్ కళ్యాణ్కు తెలిసి విచారణ చేయమన్నారని తెలిపారు. తనపై చేసిన కుట్రలను ఆధారాలతో సహా పవన్ కళ్యాణ్ ముందు ఉంచుతానని స్పష్టం చేశారు. తాను ఏ తప్పు చేయలేదని.. తనతో పాటు ఉన్నవాళ్లే తనను నమ్మలేదని పేర్కొన్నారు. తాను మంచోడిని కాబట్టే నిలబడ్డానని.. తన స్థానంలో వేరే వాళ్లు ఉంటే ఆత్మహత్య చేసుకుని ఉండేవారని తెలిపారు. వైసీపీలో రాసలీలల రాజాలు చాలామందే ఉన్నారని.. వారు నిజాయితీ పరులా అని కిరణ్ రాయల్ ప్రశ్నించారు.