సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ.. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మీద సంచలన వ్యాఖ్యలు చేశారు. డిప్యూటీ సీఎం అయిన తర్వాత పవన్ కళ్యాణ్ పూర్తిగా మారిపోయారని.. పూర్తిగా బీజేపీ ఎజెండా మోస్తున్నారని మండిపడ్డారు. చివరకు తాను సనాతని అని అనిపించుకోవడానికి క్రిస్టియన్ అయిన భార్యకు కూడా తిరుమలలో గుండు చేయించారంటూ రామకృష్ణ సంచలన వ్యాఖ్యలు చేశారు. మరోవైపు ఇటీవల తిరుమల శ్రీవారి ఆలయాన్ని సందర్ఛించిన అన్నా లెజినోవా.. తలనీలాలు సమర్పించుకుని మొక్కులు చెల్లించుకున్న సంగతి తెలిసిందే.