ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి మార్ఫింగ్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడం కలకలం రేపింది. జనసేన నేతలు పిర్యాదు చేయగా, ర్యాండమ్ ఫారెస్ట్ అనే అకౌంట్ ద్వారా అసభ్యకరంగా ఫోటోలు మార్ఫింగ్ చేశారని తెలిసింది. ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు పాల్గొన్న యోగా కార్యక్రమాన్ని కించపరిచేలా పోస్టులు పెట్టారని ఆరోపించారు. దీనిపై జనసేన నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు ఈ మార్ఫింగ్ వెనుక ఎవరున్నారో కనిపెట్టాలని డిమాండ్ చేస్తున్నారు.