ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కాన్వాయి కారణంగా పెందుర్తిలో కొంతమంది విద్యార్థులు పరీక్ష రాయలేకపోయారంటూ వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. జేఈఈ మెయిన్స్ పరీక్షలు రాయాల్సిన విద్యార్థులు పవన్ కళ్యాణ్ కాన్వాయి కోసం ట్రాఫిక్ ఆపడంతో.. పరీక్షా కేంద్రానికి సకాలంలో చేరుకోలేకపోయారని వీడియోలు వచ్చాయి. ఈ వీడియోలలో విద్యార్థులు మీడియా ఎదుట తమ బాధను వెళ్లగక్కారు. అయితే అసలు ఏం జరిగిందనే దానిపై, విశాఖపట్నం పోలీసులు సోషల్ మీడియాలో ఓ ప్రకటన విడుదల చేశారు.