పహల్గాం ఉగ్రదాడి దేశవ్యాప్తంగా ఆగ్రహం తెప్పించింది. భారత్, పాక్ సంబంధాలు మరింత దిగజారాయి. ఈ నేపథ్యంలో విశాఖపట్నంలోని కరాచీ బేకరి పేరు మార్చాలని హిందూ జన జాగరణ సమితి డిమాండ్ చేసింది. బేకరి వద్ద కార్యకర్తలు నిరసనలు చేపట్టడంతో ఉద్రిక్తత నెలకొంది. పాకిస్థాన్ నగరం పేరుపై ఇండియాలో ఇలాంటివి ఉండటం సరికాదని నిరసనకారులు తెలిపారు. పేరు మార్చాల్సిందే అని పట్టుబట్టారు. అయితే నిరసనకారులు శాంతియుతంగానే ఆందోళన చేపట్టారు. ఆ వివరాలు..