జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్ ఉగ్రదాడి.. దానికి ప్రతిస్పందనగా భారత సైన్యం చేపట్టిన ఆపరేషన్ సిందూర్ విజయవంతం అయిన వేళ.. జనసేన పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎక్స్లో ఒక ఎమోషనల్ పోస్ట్ పెట్టారు. భారతదేశ రక్షణ కోసం అహర్నిషలు కృషి చేస్తున్న సైనిక బలగాలకు ధన్యవాదాలు తెలియజేశారు. ఉగ్రవాదాన్ని అంతం చేయడానికి, దేశ ఐక్యతను చాటడానికి అందరూ కలిసి నిలబడాలని ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు. ఇక జాతీయ భద్రత కోసం జనసేన పార్టీ సర్వమత ప్రార్థనలు నిర్వహించింది.