పహల్గాం దాడికి ప్రతీకారంగా భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్ నేపథ్యంలో భారత్-పాక్ సరిహద్దులో ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ఈ సమయంలో ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ స్పందిస్తూ.. ఇరు దేశాల మధ్య యుద్ధాన్ని ఆపేందుకు తాను ప్రయత్నిస్తున్నానని తెలిపారు. ఇందుకోసం అమెరికాలోని నాయకులను కలిశానని.. మే 10న మోదీ, అమిత్ షాతో భేటీ తర్వాత పాకిస్తాన్ వెళ్తానని సంచలన కామెంట్స్ చేశారు.