పాక్పై ప్రతీకార చర్య 'ఆపరేషన్ సింధూర్' తదనంతర పరిణామాలపై సీఎం రేవంత్ ఎమర్జెన్సీ మీటింగ్కు సిద్ధమయ్యారు. ఇవాళ ఉదయం 11 గంటలకు కమాండ్ కంట్రోల్ సెంటర్లో అత్యవసర సమావేశం నిర్వహించనున్నారు. ఈ భేటీలో సీఎస్, డీజీపీ, మిలిటరీ, విపత్తు నిర్వహణ అధికారులు పాల్గొంటారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు, సహాయక చర్యలపై చర్చిస్తారు.