వైఎస్ రాజశేఖర రెడ్డి తెలుగు ప్రజలకు చిరకాల గుర్తుండిపోయే పేరు ఇది. 2004లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సీఎంగా పగ్గాలు చేపట్టిన వైఎస్.. రాష్ట్రంపై తనదైన ముద్ర వేశారు. ఆరోగ్య శ్రీ, విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ లాంటి సంక్షేమ పథకాల ద్వారా ఆయన పేదలకు చేరువయ్యారు. 2009 ఎన్నికల్లో గెలిచిన కొంత కాలానికే.. సెప్టెంబర్ 2న నల్లమల అడవుల్లోని పావురాల గుట్ట వద్ద హెలికాప్టర్ కూలిపోవడంతో వైఎస్ మరణించారు. ఈ ఘటనకు ముందు ఏం జరిగిందో విజయమ్మ మాటల్లో..