పాతపట్నం ఎమ్మెల్యే గోవిందరావుపై తెలుగుదేశం పార్టీ అధిష్టానం సీరియస్ అయ్యినట్లు తెలిసింది. జర్నలిస్టును దూషించారంటూ మామిడి గోవిందరావుపై ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే గోవిందరావును టీడీపీ అధిష్టానం వివరణ కోరినట్లు తెలిసింది. ఎమ్మెల్యేగా బాధ్యతలను గుర్తుంచుకుని హుందాగా నడుచుకోవాలని, సదరు జర్నలిస్టుకు క్షమాపణలు చెప్పాలని టీడీపీ ఏపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు ఆదేశించినట్లు సమాచారం.