పాతబస్తీవాసులకు ట్రాఫిక్ కష్టాలు తీరనున్నాయి. హాఫీజ్ బాబా నగర్ నుంచి బాలాపూర్ వరకు, బండ్లగూడ నుంచి ఎర్రకుంట వరకు రెండు ఆరు లేన్ల ఫ్లైఓవర్లు రానున్నాయి. ఓవైసీ ఫ్లైఓవర్ వద్ద లెఫ్ట్ ఆర్మ్ డౌన్ ర్యాంపు కూడా నిర్మిస్తారు. సుమారు రూ.345 కోట్లతో ఈ ప్రాజెక్టులు చేపట్టనున్నారు. ఫిబ్రవరి 3 నుంచి టెండర్లు, మార్చి 1 నుంచి పనులు ప్రారంభం కానున్నాయి. దీనివల్ల విమానాశ్రయం వెళ్లే ప్రయాణికులకు భారీ ఊరట లభించనుంది అంటున్నారు.