వరంగల్ జిల్లాలో ఆన్లైన్ మోసం వెలుగుచూసింది. బానోత్ నర్సింహ అనే వ్యక్తి తన కుమారుడి కోసం రూ.16 వేలు పెట్టి మోటరోలా ఫోన్ ఆర్డర్ చేయగా, పార్శిల్ తెరిచి చూస్తే అందులో రెండు బట్టల సబ్బులు వచ్చాయి. అయితే అతడు పార్శల్ చూసి అనుమానం వచ్చి వీడియో తీస్తూ పార్శిల్ తెరవడంతో మోసం బయటపడింది. కస్టమర్ కేర్కు ఫిర్యాదు చేయగా డబ్బు తిరిగి చెల్లిస్తామని హామీ ఇచ్చారు. ఆన్లైన్ కొనుగోళ్లలో జాగ్రత్త అవసరమని నిపుణులు సూచిస్తున్నారు.