Kurnool Palegar Pension Rs 19 Only: ఏపీలో ఒక ఆసక్తికరమైన విషయం తెలిసింది. బ్రిటిష్ కాలం నాటి పాలేగార్ పింఛను నెలకు కేవలం రూ.19 మాత్రమే. అది కూడా గత 14 ఏళ్లుగా రావడం లేదని కర్నూలు జిల్లా యాదవరాజుల కుటుంబాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. ఎన్నోసార్లు అధికారులకు మొరపెట్టుకున్నా స్పందన లేదని, ఈ చిన్న మొత్తమైనా అందడం లేదని వాపోతున్నారు. అసలు ఈ పింఛను ఎందుకు ఆగిపోయిందో తెలియక, న్యాయం కోసం ఎదురుచూస్తున్నారు.