Talliki Vandanam Scheme 2025: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమలు చేసిన తల్లికి వందనం పథకంలో ఎన్టీఆర్ జిల్లా మైలవరంలోని ఓ ప్రైవేట్ స్కూల్ నిర్లక్ష్యం కారణంగా 172 మంది విద్యార్థులు నష్టపోయారు. ఆన్లైన్ వివరాల నమోదులో పొరపాట్లు జరగడంతో వీరికి డబ్బులు జమ కాలేదు. దీంతో తల్లిదండ్రులు ఆందోళన చెందగా, పాఠశాల యాజమాన్యం అర్హులైన విద్యార్థుల పేర్లను జాబితాలో చేర్చేందుకు ప్రయత్నిస్తామని హామీ ఇచ్చింది. లేదంటే ఫీజు తగ్గిస్తామని తెలిపింది.