పారిపోయి ఇప్పుడొచ్చారా.. సిగ్గుండాలి.. విడదల రజినికి పుల్లారావు కౌంటర్

1 year ago 21
మాజీ మంత్రి, వైసీపీ నేత విడదల రజిని తనపై చేసిన వ్యాఖ్యలకు మాజీ మంత్రి, చిలకలూరిపేట ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు కౌంటర్ ఇచ్చారు. విడదల రజిని చిలకలూరిపేటలో అరాచకాలు చేసి గుంటూరుకు పారిపోయారని ఆరోపించారు. ఇప్పుడు దిక్కుతోచని స్థితిలో మరోసారి చిలకలూరిపేటకి వచ్చారని.. చిలకలూరిపేటలో తన అనుచరులతో లెక్కలేనన్ని అవినీతి పనులు చేసి గుంటూరు పారిపోయిన విషయం మర్చిపోతే ఎలా అని ప్రశ్నించారు. నమ్మి ఓటేసిన చిలకలూరిపేట వాసుల్ని పూర్తిగా నాశనం చేశారని.. ఈ ఏడు నెలలు ఎక్కడ దాక్కున్నారని ప్రశ్ని్ంచారు. విడదల రజిని అరాచకాలు మొత్తం బయటకు తీసి..తిన్నదంతా కక్కిస్తామని స్పష్టం చేశారు. రాబోయే రోజుల్లో ఎట్టిపరిస్థితుల్లోనూ వదిలిపెట్టేది లేదని స్పష్టం చేశారు.
Read Entire Article