హస్తినాపురంలో తెలుగువాణి బలంగా వినిపిస్తోంది. వివిధ సమస్యలు, అంశాలపై మన ఎంపీలు పార్లమెంట్ సమావేశాల్లో గళమెత్తుతున్నారు. పాలిటిక్స్ ఫర్ ఇంపాక్ట్ సంస్థ నివేదిక ప్రకారం ప్రశ్నలు అడిగిన విషయంలో జాతీయ సగటు కంటే ఏపీ ఎంపీల సగటు ఎక్కువ కావటం విశేషం. ఏపీలోని పార్టీలలో టీడీపీ ఎంపీలు ఎక్కువ ప్రశ్నలు సంధించగా.. అందులో విజయనగరం ఎంపీ కలిశెట్టి అగ్రస్థానంలో ఉన్నారు. అలాగే అత్యుత్తమ పనితీరు కనబరిచిన ఎంపీల జాబితాలో నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు అగ్రస్థానంలో ఉన్నారు.