పాలమూరుకు అరుదైన అవకాశం.. 400 ఎకరాల్లో బ్రహ్మోస్ యూనిట్

8 months ago 8
Brahmos Missile Unit in Mahabubnagar: తెలంగాణలో బ్రహ్మోస్ క్షిపణి తయారీ యూనిట్ ఏర్పాటుకు కేంద్రం అనుమతిచ్చింది. దీనిని మహబూబ్‌నగర్ జిల్లాలో ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోరారు. దేవరకద్రలో అనుకూలమైన వాతావరణం ఉన్నట్లు అధికారులు గుర్తించారు. హైదరాబాద్‌లో స్థలం కొరత కారణంగా మహబూబ్‌నగర్‌ను ఎంపిక చేశారు. ఇది హైదరాబాద్, బెంగళూరులకు రహదారి అనుసంధానం కలిగి ఉంది. చౌదర్‌పల్లి, బస్వాయిపల్లి గ్రామాల్లో 400 ఎకరాల ప్రభుత్వ భూమిని అధికారులు పరిశీలించారు.
Read Entire Article