విద్యా రంగ సంస్కరణలు, పాలిటెక్నిక్ కాలేజీలపై నెలకొన్న అనుమానాలు, ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలపై సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో స్పష్టత ఇచ్చారు. ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీలను ప్రైవేటీకరించే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు. టెక్నికల్ విద్యను స్కిల్స్ యూనివర్సిటీతో అనుసంధానం చేయడం ద్వారా విద్యార్థులకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యాలు, మెరుగైన ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యమన్నారు. మరోవైపు విద్యాశాఖ బడ్జెట్ను రూ.26,647 కోట్లకు పెంచామని, 32 నెలల్లో ఫీజు రీయింబర్స్మెంట్ కింద రూ.3,488 కోట్లు చెల్లించినట్లు సీఎం వెల్లడించారు.