వైఎస్సార్సీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ మరోసారి కార్యకర్తల సమావేశంలో ఎమోషనల్ అయ్యారు. శనివారం జరిగిన పార్టీ సమావేశంలో ఇటీవల టీడీపీలో చేరిన తన మేనల్లుడు చిన్న శ్రీను గురించి ప్రస్తావనకు వచ్చింది. దీంతో ఆయన మరోసారి కంటితడి పెట్టుకున్నారు. విజయనగరం జిల్లా వైసీపీ నేతలు, కార్యకర్తలతో స్థానిక సంస్థల ఎన్నికలపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ మాట్లాడుతుండగా.. మాజీ మంత్రి బొత్స భావోద్వేగంతో కంటతడి పెట్టుకున్నారు.