పాశమైలారంలో మరో అగ్ని ప్రమాదం.. భారీగా ఎగిసిపడుతున్న మంటలు

11 months ago 18
సంగారెడ్డి జిల్లా పాశమైలారం పారిశ్రామికవాడలో మరో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఎన్‌వీరో వేస్ట్ మేనేజ్‌మెంట్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ పరిశ్రమలో ఇవాళ ఉదయం భారీ అగ్నిప్రమాదం జరిగింది. వ్యర్థాల నిర్వహణ కేంద్రం కావడంతో రసాయనాల కారణంగా మంటలు వేగంగా వ్యాపించి దట్టమైన పొగ కమ్ముకుంది. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేయడానికి తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Read Entire Article