Ig Ashok Kumar On Pastor Praveen Pagadala Death Case: పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతి కేసు మిస్టరీ వీడింది. ఆయన మరణానికి కారణాలను ఐజీ అశోక్ కుమార్ తెలిపారు. ప్రవీణ్ అతిగా మద్యం సేవించి ఉండటం వల్లనే రోడ్డు ప్రమాదం జరిగిందని పోలీసులు నిర్ధారించారు. టెక్నాలజీ సాయంతో కేసును దర్యాప్తు చేశామని, సీసీటీవీ ఫుటేజీలను సేకరించామని ఐజీ వివరించారు. ప్రవీణ్ ప్రయాణంలో మద్యం కొనుగోలు చేసినట్లు గుర్తించామని, ప్రమాదం జరిగిన సమయంలో ఆయన 70 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తున్నారని తెలిపారు.