ప్రజా సంక్షేమానికి పింఛన్ పథకాలు కీలకం. కానీ అవి సరైన వారికి చేరకపోతే.. ప్రజాధనం వృథా కావడమే కాకుండా నిజంగా అర్హులైనవారు నష్టపోతారు. కరీంనగర్ జిల్లా ఇల్లందకుంట మండలంలో వెలుగులోకి వచ్చిన దివ్యాంగుల పింఛన్ల అక్రమాలు ఈ అంశాన్ని మళ్లీ మన ముందుకు తెచ్చాయి. ఆ మండలంలో విజిలెన్స్ పరిశీలనలో 41 మందిని అనర్హులుగా గుర్తించారు. అంతే కాకుండా.. వారి పెన్షన్ కూడా తక్షణమే రద్దు చేశారు. ఇక మిగిలిన 75 మందికి సంబంధించి మెడికల్ రిపోర్ట్స్ రానున్నాయి. వీటి తర్వాత నిర్ణయం తీసుకోనున్నారు.