ప్రభుత్వ పాఠశాలను కాపాడేందుకు గ్రామపంచాయతీ వినూత్న నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ బడిలో పిల్లలను చేర్పించే కుటుంబాలకు నెలకు 25 కిలోల అదనపు బియ్యం, ఒక రైస్ కుక్కర్, ఐదో తరగతి పూర్తయ్యాక సైకిల్ అందించనున్నట్లు ప్రకటించింది. అదనంగా స్కూల్ బ్యాగ్, నోట్బుక్స్, విద్యా సామగ్రి ఉచితంగా ఇవ్వనున్నారు. సర్పంచ్ నేతృత్వంలోని ఈ పథకం జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశమై సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.