హైదరాబాద్ మే 7 నుండి 31 వరకు 72వ మిస్ వరల్డ్ పోటీలకు ఆతిథ్యం ఇవ్వనుంది. 120 దేశాల నుండి 140 మంది పోటీదారులు హాజరుకానున్నారు. తెలంగాణ సంస్కృతిని చాటేలా పర్యాటక ప్రాంతాల సందర్శన, విమానాశ్రయంలో ఘన స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. పోటీల్లో పాల్గొనే అందాల భామలను రాష్ట్రంలోని ముఖ్యమైన పర్యాటక ప్రాంతాలకు తీసుకెళ్లడానికి ప్రత్యేక ప్రణాళికలు రూపొందించారు. తొలుత 21 పర్యాటక ప్రాంతాలను సందర్శించాలని భావించినప్పటికీ.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేక చొరవతో మహబూబ్నగర్ జిల్లాలోని చారిత్రాత్మక పిల్లల మర్రిని కూడా ఈ జాబితాలో చేర్చారు.