సీనియర్ ఐపీఎస్ అధికారి పీఎస్ఆర్ ఆంజనేయులుకు హైకోర్టు ఊరటనిచ్చింది. ఏపీపీఎస్సీ అవకతవకల కేసులో ఆయనకు 14 రోజుల మధ్యంతర బెయిల్ లభించింది. అనారోగ్య కారణాల దృష్ట్యా, ముఖ్యంగా గుండె సంబంధిత సమస్యల కారణంగా కోర్టు ఈ నిర్ణయం తీసుకుంది. గతంలో ఏపీపీఎస్సీ కార్యదర్శిగా పనిచేసిన ఆంజనేయులు గ్రూప్-1 మెయిన్స్ మూల్యాంకనంలో అవకతవకలకు పాల్పడ్డారనే ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ప్రస్తుతం ఆయన విజయవాడ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.