హైదరాబాద్ మెట్రో రైలు ప్రయాణికులకు సౌకర్యంగా ఉన్నా, ఆర్థికంగా మాత్రం కష్టాల్లో ఉంది. ప్రారంభం నుంచి నష్టాలు వస్తూనే ఉన్నాయి. కరోనా లాక్ డౌన్ వల్ల రాబడి తగ్గిపోయింది. తీసుకున్న రుణాల వడ్డీలు కట్టలేక నష్టాలు మరింత పెరిగిపోయాయి. టికెట్ ధరలు పెంచే ఆలోచనలో ఉన్నారట. మరి ఈ ఆర్థిక ఇబ్బందుల నుంచి మెట్రో ఎలా బయటపడుతుందో చూడాలి.