Infant Dies in Tallarevu Govt Hospital: కాకినాడ జిల్లా తాళ్లరేవు సామాజిక ఆరోగ్య కేంద్రంలో వైద్య సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా ఓ పసికందు మృతి చెందడం తీవ్ర విషాదాన్ని నింపింది. పురిటి నొప్పులతో బాధపడుతున్న మహిళకు సకాలంలో వైద్యం అందక, బిడ్డ మరణించడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చేపట్టారు. వైద్యురాలిని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తూ ఆసుపత్రి ఎదుట ధర్నాకు దిగారు. ఆర్డీవో, ఎమ్మెల్యే హామీతో ఆందోళన విరమించారు. ఈ ఘటనపై విచారణకు ఆదేశించారు.