రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్, గ్యాస్, యూరియా కొరతపై తీవ్ర ఆందోళనలు వ్యక్తం అవుతున్న వేళ.. సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో అత్యవసర సమావేశం నిర్వహించనున్నారు. రాష్ట్రంలో ఉన్న నిల్వలు, సరఫరాలకు సంబంధించి చర్చించనున్నారు. అనంతరం రాష్ట్రంలో కొరత లేకుండా వినియోగదారులకు పకడ్బందీగా సరఫరా చేయాలని ఆదేశాలు జారీ చేయనున్నారు.