పెట్రోల్ దొంగిలిస్తున్నారని బైక్కు ఓ వ్యక్తి కరెంటు షాక్ పెట్టాడు. కానీ దురదృష్టవశాత్తు ఆ కరెంటు అతడి ఇంట్లోనే తీవ్ర విషాదాన్ని నింపింది. ప్రమాదవశాత్తు బైకు పట్టుకొని అతడి భార్యే ప్రాణం కోల్పోయింది. ఈ విషాదకర ఘటన కామారెడ్డి జిల్లా సీతారాంపల్లిలో చోటుచేసుకుంది.