Fire at East India Petroleum Company Vizag: విశాఖపట్నంలో అగ్నిప్రమాదం జరిగింది. ఈస్ట్ ఇండియా పెట్రోలియం కంపెనీలోని పెట్రోల్ ఫిల్టర్ ట్యాంక్ మీద పిడుగు పడింది. దీంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న వెంటనే అగ్ని మాపక సిబ్బంది అక్కడకు చేరుకున్నారు. ఫైరింజన్ల సాయంతో మంటలను నియంత్రించే ప్రయత్నం చేస్తున్నారు.ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.